English | Telugu

గెలిచేది ఎవరు!

అనుష్క(Anushka),రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ ఇద్దరు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ప్రవేశించి తమ అద్భుతమైన నటనతో టాప్ హీరోయిన్ఫ్ గా ఎదిగారు. హీరోలకి దీటుగా తమ కంటు ప్రత్యేకమైన అభిమాన గణాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది. అందుకే బడా నిర్మాతలు ఈ ఇద్దర్ని ప్రధాన పాత్ర చేసుకొని భారీ వ్యయంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలోనే అనుష్క, రష్మిక మధ్య పోటీ ఏర్పడబోతుందనే వార్తలు వస్తున్నాయి.

అనుష్క ప్రధాన పాత్రలో విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్(Krish)దర్శకత్వంలో 'ఘాటీ'(Ghaati)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో 'వేదం' వచ్చి ఉండటం, ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, అనుష్క లుక్ తో 'ఘాటీ' పై అందరిలోను అంచనాలు పెరిగాయి. 'అరుంధతి' లా 'ఘాటీ' బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని అభిమానులు అయితే బలంగానే నమ్ముతున్నారు. ప్రస్తుతం 'విఎఫ్ఎక్స్' పనుల్లో ఉన్న ఈ మూవీ,సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే డేట్ కి రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl friend)కూడా రిలీజ్ కాబోతుందనే చర్చ చాలా జోరుగానే నడుస్తుంది. ఈ మేరకు మేకర్స్ త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారని కూడా అంటున్నారు. పుష్ప 2 , యానిమల్, చావా, కుబేర లతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం, అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 'గర్ల్ ఫ్రెండ్' ని నిర్మిస్తుండంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాల ద్వారా ఈ చిత్ర కథపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనుష్క, రష్మిక ఒకేసారి పోటీపడితే ఎవరు పై చేయి సాధిస్తారనే ప్రచారం సినీ సర్కిల్స్ లో జరుగుతుంది.

నాగార్జున(Nagarjuna),పూరి జగన్నాధ్(Puri jagannadh)కాంబోలో 2005 లో వచ్చిన 'సూపర్' మూవీతో అనుష్క సినీ రంగ ప్రవేశం చేయగా, నాగశౌర్య హీరోగా 2018 లో వచ్చిన ఛలో మూవీతో 'రష్మిక' హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.