English | Telugu

"అంతఃపురం" సీక్వెల్ హీరో ఆది

గతంలో జగపతిబాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, సౌందర్య, శారద ప్రథాన పాత్రలు పోషించగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో నిర్మించబడిన సూపర్ హిట్ చిత్రం "అంతఃపురం". ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో కృష్ణ వంశీ ఉన్నారట. ఆ సీక్వెల్లో హీరోగా ఆది నటించనున్నాడట. "అంతఃపురం" చిత్రం ముగింపులో సాయి కుమార్ చనిపోతే అతని భార్య సౌందర్య పసిబిడ్డను తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతుంది.

ఆ బిడ్డ పెద్దవాడై తిరిగి రాయల సీమకు రావటంతో ఈ సీక్వెల్ చిత్రం మొదలవుతుందట. ఈ సీక్వెల్లో యువ హీరో సాయి సొంత కుమారుడైన ఆది హీరోగా నటించనున్నాడట. ఆది గతంలో "ప్రేమ కావాలి" అనే చిత్రంలో హీరోగా నటించాడు. ప్రస్తుతం బి.జయ దర్శకత్వంలో, బి.ఎ.రాజు నిర్మిస్తున్న "లవ్లీ" చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.