English | Telugu

అమితాబ్ మెడ చుట్టూ బిగుస్తున్నపనామా పాము..!

దేశప్రజల నుంచి అత్యంత గౌరవం పొందే వ్యక్తుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. సినీ కెరీర్ తో పాటు, తన జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన అమితాబ్ అంటే భాషతో సంబంధం లేకుండా భారతదేశమంతటా గౌరవిస్తారు. కానీ పనామా పేపర్స్ ఉదంతం, ఆయన గౌరవానికి భంగం కలిగించేలా కనిపిస్తోంది. విదేశాల్లో ఆయన నల్లధనం పెట్టుబడుల గురించి పనామా పత్రాల్లో మరిన్ని విషయాలున్నాయంటూ జాతీయ మీడియా చెబుతోంది. పనామా పత్రాలు ఆయన నాలుగు విదేశీ కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరించారంటూ పేర్కొన్నాయి.

90 వ దశకంలో అనేక విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, ఆ కంపెనీల్లో బిగ్ బీ చాలా కీలక పాత్రల్లో ఉన్నారని పనామా పేపర్స్ చెబుతున్నాయి. ట్రంప్ షిప్పింగ్ లిమిటెడ్, సీ బల్క్ షిప్పింగ్ కంపెనీల బోర్డు సమావేశాల్లో కూడా అమితాబ్ పాల్గొన్నారని వాటిలో ఉంది. మరో వైపు బిగ్ బి మాత్రం, ఈ ఆరోపణల్ని ఖండించారు. తాను ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వానికి సమాధానం ఇచ్చానని, ఇంకా కావాలంటే మళ్లీ విచారణకు సహకరిస్తానని బిగ్ బచ్చన్ చెబుతున్నారు. నల్ల ధన కుబేరుల వివరాలు వెల్లడించి సంచలనం సృష్టించిన పనామా పేపర్స్, అమితాబ్ కూడా నల్లధనం దాచుకున్న వారిలో ఉన్నారంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.