English | Telugu

స‌రైనోడు... సెకండాఫ్ గోవిందానా?!!

ఈమ‌ధ్య బోల్డంత హైప్ తెచ్చుకొన్న సినిమాలు బాక్సాఫీసు ముందు మాత్రం బొక్క‌బోర్లా ప‌డుతున్నాయి. అంచ‌నాలు అందుకోలేక‌... అభిమానుల్ని నిరాశ‌లో ముంచెత్తుతూ డిజాస్ట‌ర్ల జాబితాలో క‌ల‌సిపోతున్నాయి. మొన్న‌ అఖిల్ నిన్న‌.. బ్రూస్లీ ఈ రోజు.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప‌రిస్థితి ఇంతే క‌దా?? ఇప్పుడు స‌రైనోడు సినిమాపైనా విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. వ‌రుస‌గా హిట్ల‌తో రేసుగుర్రంలా దూసుకుపోతున్న అల్లు అర్జున్‌తో... లెజెండ్‌లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్టిచ్చిన బోయ‌పాటి శ్రీ‌ను జ‌త‌క‌లిశాడంటే ఆ అంచ‌నాలు ఏ రేంజులో ఉంటాయో చెప్ప‌క్క‌ర్లెద్దు. దానికి తోడు ట్రైల‌ర్ల‌తోనే బోయ‌పాటి భ‌య‌పెట్టేస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీసు బొనాంజా కావ‌డం ఖాయం అంటూ మెగా అభిమానులు లెక్క‌లేసుకొంటున్నారు.

అయితే... బ‌న్నీ అభిమానుల‌కు మాత్రం ఇది కాస్త టెన్ష‌న్ పెట్టే వార్తే. స‌రైనోడు ఫ‌స్టాప్ ఓ రేంజులో సాగిపోయింద‌ట‌. హై ఓల్టేజీ యాక్ష‌న్ సీన్లు.. బ‌న్నీ అదిరిపోయే స్టెప్పులూ, డైలాగుల‌తో వారెవా అనిపించాడ‌ట‌. ఇంట్ర‌వెల్ ఫైట్ అయితే.. బ‌న్నీ కెరీర్‌లోనే సూప‌ర్బ్ అట‌. అయితే సెకండాఫ్ మాత్రం.. అనుకొన్నంత స్థాయిలో లేద‌ని టాక్‌. ఫ‌స్టాఫ్ ఎంత లేపాడో.. సెకండాఫ్ అంత‌గా కింద‌కు తొక్కేశాడ‌ని... రెండు వేర్వేరు సినిమాలు చూస్తున్నామా అన్న ఫీలింగ్ వ‌చ్చింద‌ని... ఈ సినిమాని చూసిన అతి కొద్ది మంది ఇచ్చిన విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇటీవ‌ల ఈ సినిమా చూసిన చిరు.. సెకండాఫ్‌పై త‌న‌కున్న అభ్యంత‌రాల‌న్ని వ్య‌క్తం చేశాడ‌ట‌. దానికి త‌గ్గ‌ట్టుగానే 4 రోజుల పాటు రీషూట్ చేశార‌ట‌. అయినా స‌రే... సెకండాప్‌లో ఏదో లోటు క‌నిపిస్తోంద‌ని టాక్‌. ఎన్టీఆర్ తో బోయ‌పాటి శ్రీ‌ను తీసిన ద‌మ్ము కూడా ఇంతే. ఫ‌స్టాఫ్ ఓరేంజులో తీసుకెళ్లి.. సెకండాప్ ఢామ్మ‌ని కింద‌కు ప‌డేశాడు. అందుకే స‌రైనోడు.. ద‌మ్ము 2 అవుతుందా? అంటూ బ‌న్నీ అభిమానులు ఇప్పుడు భ‌య‌ప‌డుతున్నారు. చిరంజీవి ఇచ్చిన స‌ల‌హాలూ... బోయ‌పాటి ఆఖ‌రి నిమిషాల్లో చేసిన మార్పులే.. ఈ సినిమాని ఆదుకోవాలి. లేదంటే బ‌న్నీ వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ ప‌డిన‌ట్టే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.