English | Telugu

The Raja Saab Trailer 2.0: 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్.. మారుతి ఇలా చేస్తాడని ఊహించలేదు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తన కెరీర్ లో మొదటిసారి 'ది రాజా సాబ్'(The Raja Saab) అనే హారర్ కామెడీ ఫిల్మ్ చేశాడు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.. ఆడియన్స్ లో ఈ సినిమాపై ఎక్కడో చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఆ అనుమానాలు అన్నింటినీ పటాపంచలు చేసేలా రాజా సాబ్ ట్రైలర్ 2.0 వచ్చింది.

'ది రాజా సాబ్' నుంచి తాజాగా మేకర్స్ కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మూడు నిమిషాలకు పైగా నిడివితో రూపొందిన ఈ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ లా ఉంది. గతంలో విడుదలైన టీజర్, ట్రైలర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్ ని చూపిస్తే.. ఈ ట్రైలర్ లో మాత్రం ప్రధానంగా ఎమోషన్స్ ని చూపించారు. నానమ్మ, మనవడి బాండింగ్ ని తెలిపే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. హారర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. విజువల్స్ కట్టిపడేశాయి. కొన్ని కొన్ని షాట్స్ హాలీవుడ్ సినిమాలని తలపించాయి.

తమ నానమ్మ కోసం అత్యంత ప్రమాదకరమైన తాత భూతం(సంజయ్ దత్)తో ప్రభాస్ తలపడినట్లు ట్రైలర్ ను రూపొందించారు. హారర్ ఎలిమెంట్స్ ఎంతగా హైలైట్ అయ్యాయో.. ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో హైలైట్ అయ్యాయి. ఇక ప్రభాస్ ని చూపించిన తీరు మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా మొసలిని పైకి లేపి నేలకేసి కొట్టే షాట్ మెయిన్ హైలైట్ గా నిలిచింది. అలాగే ట్రైలర్ చివరిలో జోకర్ గెటప్ లో ప్రభాస్ కనిపించడం బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. విజువల్స్ తో పాటు తమన్ మ్యూజిక్ కూడా మెప్పించింది.

మొత్తానికి 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్ తో డైరెక్టర్ మారుతి సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. తాను భారీ సినిమాలు చేయగలననే విషయాన్ని ఈ ట్రైలర్ తో బలంగా చాటి చెప్పాడు.

Also Read: కళ్లుచెదిరే ధరకి AA22 ఓటీటీ డీల్.. బడ్జెట్ లో 60 శాతం వచ్చేసింది!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.