English | Telugu

వార్నింగ్ మీద అలీ క్లారిటీ!!

వేదిక ఎక్కాడంటే అలీకి కంట్రోల్ చేయ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. మైకు ప‌ట్టుకొని.. డ‌బుల్ మీనింగ్ డైలాగులు వల్లించేస్తాడు. సిగ్గుతో త‌ల‌వొంచుకొని వ‌చ్చీరాని న‌వ్వులు చిందిస్తుంటే... అదే ఎంజాయ్ మెంట్ అనుకొంటాడు అలీ! ఈమ‌ధ్య యాంక‌ర్ సుమ‌పై కూడా ఓ కుళ్లు జోకు పేల్చాడు. ఆ త‌ర‌వాత స‌మంత న‌డుంని బెంజ్ స‌ర్కిల్‌తో వ‌ర్కించాడు. ఈ కామెంట్ల‌పై సుమ‌, స‌మంత సీరియ‌స్ అయ్యార‌ని, అలీకి వార్నింగ్ ఇచ్చార‌ని టాక్‌. వీటిపై అలీ స్పందించాడు. త‌న‌కు వార్నింగులు ఇచ్చేవాళ్లు ఇంత వ‌ర‌కూ పుట్ట‌లేద‌న్నాడు. తాను ఎలాంటివాడో ప‌రిశ్ర‌మ‌కు తెలుస‌ని, త‌న జోకుల్ని అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌ని...వాళ్ల న‌వ్వుల కోస‌మే తాను అలా మాట్లాడ‌తాన‌ని క్లియ‌ర్ గా చెప్పేశాడు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఆడియో వేడుక‌లో సుమ వేదిక వెన‌క్కి తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చింది అబ‌ద్ధ‌మ‌న్నాడు. 'ఈరోజు తొంద‌ర‌గా వెళ్లిపోవాలి..' అని సుమ చెబితే.. దాన్ని అంద‌రూ వార్నింగ్ అనుకొంటే ఎలా అంటున్నాడు అలీ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.