English | Telugu

నాగార్జున వారసుడి రెండో సినిమా ఇదేనా..?

మొదటి సినిమా తోనే అందగాడని పేరు సంపాదించుకున్నాడు అక్కినేని అఖిల్. ఆ సినిమా నిరాశపరిచినా, అఖిల్ మాత్రం మంచి మార్కులతో పాసయ్యాడు. ఇప్పుడు భారీ హిట్ ఇచ్చేవరకూ, అఖిల్ పై చాలా ఒత్తిడి ఉంటుందన్నది వాస్తవం. అందుకే రెండో సినిమా కొత్త కథలతో కాకుండా, రీమేక్ తో అదరగొడదామని ఫిక్సయ్యాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన యే జవానీ హై దీవానీ సినిమాను అఖిల్ రీమేక్ చేయనున్నాడని సమాచారం. ఆ సినిమా అఖిల్ కు చాలా నచ్చిందట. దాంతో అదే సినిమాను తెలుగులో చేద్దామని ఫిక్సయ్యాడట. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తున్న ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్లో రాబోతోందట. త్వరలోనే, సినిమా సంబంధించి వివరాల్ని ప్రకటించనున్నారు. ఏప్రిల్ నెలాఖరుకు షూటింగ్ కు ఈ సినిమా పట్టలెక్కే అవకాశం ఉంది. మరి అఖిల్ తన రెండో సినిమాతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.