English | Telugu

శంకర్ పై కూతురు అదితి కీలక వ్యాఖ్యలు..మా నాన్న ఏం చెప్పడు

ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్(Shankar)ఒకరు. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకేఒక్కడు, జీన్స్, అపరిచితుడు, రోబో వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం భారతీయుడు 3 కి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. శంకర్ పెధ్ద కూతురు అదితి శంకర్(Aditi Shankar)2022 లో కార్తీ(Karti)హీరోగా తెరకెక్కిన 'విరుమాన్' తో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తర్వాత మా వీరన్, నేసిప్పాయ వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది.సింగర్ గాను రాణిస్తు గేమ్ చేంజర్ తమిళ వెర్షన్ కి సంబంధించి 'ధోప్' సాంగ్ ని ఆలపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.

అదితి ఇప్పుడు తెలుగులో భైరవం(Bhairavam)అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. సాయిశ్రీనివాస్(Sai Srinivas)మంచు మనోజ్(Manchu Manoj)నారా రోహిత్(Nara Rohit)హీరోలుగా చేస్తున్నారు. ఈ నెల 30 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అదితి మాట్లాడుతు శంకర్ కూతురు అనే గుర్తింపుని ఒక గౌరవంగా భావిస్తాను. కానీ ఆ గుర్తింపు నాపై ఒత్తిడి పెంచుతుందని భావించను. మా నాన్నకి నేను చేస్తున్న సినిమాల గురించి ఏమి తెలియదు. ఆయన సినిమాలతో ఆయన బిజీగా ఉంటారు. కాకపోతే నా సినిమాలని మాత్రం తప్పకుండా నాన్న చూడాల్సిందే. పట్టు బట్టి మరి చూపిస్తాను. నటిగా నా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి.

భైరవం గురించి చెప్పాల్సి వస్తే మనోజ్ నాకు ఎప్పట్నుంచో తెలుసు. తొలి రోజు సెట్ లోకి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే నేనే హీరోయిన్ అని చెప్పాను. పైగా మనోజ్, సాయి శ్రీనివాస్, రోహిత్ కి ముందు నుంచే తమిళం వచ్చు కాబట్టి షూటింగ్ లో నాకెలాంటి సమస్య రాలేదు. తెలుగు సినిమాల్లో నటించాలని ఎప్పట్నుంచో కోరిక. మా నాన్న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్ చేసినా వెళ్లే దాన్ని. అలాంటిది నా సినిమా కోసం ఇక్కడకొచ్చి షూటింగ్ లో పాల్గొంటానని ఎప్పుడు అనుకోలేదని అదితి చెప్పుకొచ్చింది. క భైరవం మూవీనిసత్య సాయి ఆర్ట్స్ పై కె కె రాధామోహన్ నిర్మించగా విజయ్ కనక మేడల(VIjay Kanakamedala)దర్శకత్వం వహించాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.