English | Telugu

ఎందుకిలా చేస్తోంది.. తెలుగు వారంటే అంత చులకనా?

కమల్‌హాసన్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలో ప్రవేశించి నటిగానే కాదు, సింగర్‌ కూడా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో దాదాపు 50 పాటలు పాడిన శ్రుతి.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది. పలు భాషల్లో సినిమాలు చేసినప్పటికీ తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ గబ్బర్‌ సింగ్‌. అయితే ఈమధ్య తెలుగు సినిమాలు చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా వాటిపై కూడా శ్రద్ధ పెట్టడం లేదని తెలుస్తోంది. అడివి శేష్‌ హీరోగా చేస్తున్న డెకాయిట్‌ సినిమాలో మొదట శ్రుతిహాసన్‌ హీరోయిన్‌ అనుకున్నారు. దానికి సంబంధించిన టీజర్‌ కూడా రిలీజ్‌ చేశారు. కానీ, సడన్‌గా ఆమె స్థానంలోకి మృణాల్‌ ఠాకూర్‌ వచ్చి చేరింది.

ప్రస్తుతం తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలేవీ లేవు. ఆమె చేసిన చాలా సినిమాలు హిట్‌ అయినప్పటికీ సినిమాలు రాకపోవడానికి రీజన్‌ ఏమిటనేది ఆలోచిస్తే.. తను కావాలనే తెలుగు ఇండస్ట్రీని అవాయిడ్‌ చేస్తోందనే సమాధానం వస్తోంది. చాలా మంది హీరోయిన్లలాగే శ్రుతి కూడా దర్శకనిర్మాతలను బాగా ఇబ్బందులకు గురి చేసేదని తెలుస్తోంది. దాంతో ఆమె పట్ల వారికి ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. అందుకే వేరే హీరోయిన్లకు అవకాశాలు ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా శ్రుతికి తెలుగు సినిమాల్లో ఛాన్స్‌ ఉండదు అని తెలుస్తోంది. తెలుగు సినిమాలపై ఆమె కూడా దృష్టి తగ్గించింది కాబట్టి ఇకపై టాలీవుడ్‌లో సినిమాలు చేసే అవకాశం లేదు. ఆమె చెయ్యాల్సిన ఒకే ఒక్క సినిమా సలార్‌2. ఈ సినిమా ముందుగానే కమిట్‌ అయింది కాబట్టి చెయ్యక తప్పదు. ఆగస్ట్‌ 14న విడుదల కాబోతున్న కూలీలో నటించింది శ్రుతి. సలార్‌ తర్వాత మరో సినిమా చెయ్యని శ్రుతిహాసన్‌కి ఈ సినిమా కీలకం అని చెప్పాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.