English | Telugu

ఇండస్ట్రీలో విషాదం.. విలన్‌ మోహన్‌రాజ్‌ కన్నుమూత!

1990వ దశకంలో విలన్‌ అంటే ప్రతి డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కీ కనిపించేది ఒక్కరే. అతనే మోహన్‌రాజ్‌. దాదాపు 15 సంవత్సరాలపాటు తెలుగులో తిరుగులేని విలన్‌గా పేరు తెచ్చుకున్న మోహన్‌రాజ్‌ ఇకలేరు. గత నాలుగురోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌రాజ్‌కు గురువారం గుండెపోటు వచ్చింది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించిందని, ఇంటికి తీసుకెళ్లిపోవాల్సిందిగా వైద్యులు సూచించారు. అప్పుడాయన్ను తిరువనంతపురం దగ్గరలోని కంజిరంకులం ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మోహననరాజన మఋతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

1988లో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు మోహననరాజన. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు. మలయాళంలో కిరీదమ్‌ అనే చిత్రంలో ఒక భయంకరమైన విలన్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ అవకాశం మోహన్‌రాజ్‌కు లభించింది. ఆరడుగులకు పైగా ఎత్తుతో భారీ విగ్రహంతో కనిపించే మోహన్‌రాజ్‌ ఆ సినిమాలో కిరిక్కాడాన్‌ జోస్‌ పాత్ర పోషించారు. అప్పటి నుంచి మలయాళంలో అదే పేరుతో ప్రసిద్ధికెక్కారు. తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు మోహన్‌రాజ్‌. తెలుగులో ఆయనకి పేరు తెచ్చిన సినిమాలు లారీ డ్రైవర్‌, నిప్పురవ్వ, చినరాయుడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, అసెంబ్లీ రౌడీ వంటి అనేక చిత్రాల్లో హీరోతో ఢీ అంటే ఢీ అనే క్యారెక్టర్లు చేసి ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. మోహన్‌రాజ్‌ నటించిన చివరి సినిమా శివశంకర్‌.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.