English | Telugu

కమల్ కి సారీ చెప్పిన పీకే

లోకనాయకుడు కమల్ హాసన్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్. వివరాల్లోకి వెళితే... కమల్ సినిమా 'విశ్వరూపం'. ఈ సినిమా విడుదల విషయంలో కమల్ హాసన్ ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవలేమో..! అని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అ సమయంలో పరిశ్రమ మొత్తం రానప్పటికి, సినీ ప్రముఖులు కొందరు వ్యక్తిగతంగా కమల్ కు మద్దత్తు పలికారు. అయితే ఆ సమయంలో వేరే పని వత్తిడి వల్ల అమీర్ స్పదించలేకపోయాడట. తాజాగా కమల్ తో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు అమీర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ...'విశ్వరూపం' విడుదల విషయంలో కమల్ హాసన్ ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నడవాలి. కానీ, వేరే పని ఒత్తిడి వల్ల వ్యక్తిగత మద్దతు కూడా తెలపలేకపోయా. ఈ విషయమై ఇప్పటికీ చింతిస్తుంటాను. ఈ విషయంలో కమల్ కు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా'అని వ్యాఖ్యానించాడు అమీర్.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.