English | Telugu

ఔను..ఆమె మళ్ళీ ప్రేమలో పడింది

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి ప్రేమలో పడ్డారు. అవును… నిజమే… పవన్ తో విడిపోయి ఒంటరిగా ఉంటున్న రేణూ మళ్లీ ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు… ఆమే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.గతంలో పవన్ ను ప్రేమించి పెళ్లాడి.. పిల్లలను కని… పవన్ తో వేరుపడిన ఈ సుందరి ఇక ప్రేమలో పడనని అభిమానులకు మాట ఇచ్చింది. అయితే, మళ్లీ ఇప్పుడు ఆమె ప్రేమలో పడింది. మాట తప్పినందుకు అభిమానులను క్షమాపణలు కూడా కోరుతోంది రేణూ. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె ప్రేమలో పడింది ఆమెతోనేనట… ”నాతో నేను ప్రేమలో పడ్డాను” అని రేణూ దేశాయి తాజాగా ట్విట్టర్ లో పెట్టింది. ఆమె చేసిన ట్వీట్ మొత్తం చదివితే కానీ ఈ సంగతి తెలియలేదు. రేణూ ఇప్పుడు ప్రేమ గురించి మళ్లీ మాట్లాడుతుందంటే… కొద్ది రోజుల్లో ఇంకో ట్వీట్ చేస్తుందేమో చూడాలి. అందులో ఈసారి ఏం పెడుతుందో ఏమో? రేణూ తీరు చూస్తుంటే సమ్ థింగ్… సమ్ థింగ్ కదా.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.