English | Telugu

టాలీవుడ్ లో వాయిదాల పర్వం.. పెద్ది, ప్యారడైజ్ బాటలో మరో క్రేజీ మూవీ!

ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మార్చిలో విడుదల కావాల్సిన 'పెద్ది', 'ది ప్యారడైజ్' వాయిదా పడినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా ఈ లిస్టులో మరో సినిమా చేరినట్లు తెలుస్తోంది.

విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు టాక్. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో లేదా దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (Aadarsha Kutumbam House No 47)

వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్స్ కి త్రివిక్రమ్ రైటర్ గా పని చేశారు. అందుకే వెంకీ, త్రివిక్రమ్ కాంబో అనగానే.. ప్రకటనతోనే 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

నిజానికి 'ఆదర్శ కుటుంబం' కన్నా ముందు కుమారస్వామి కథతో 'గాడ్ ఆఫ్ వార్' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు త్రివిక్రమ్. ఆ భారీ మూవీ ఆలస్యమవ్వడంతో.. వెంకటేష్ తో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను పట్టాలెక్కించారు.

'గాడ్ ఆఫ్ వార్' మొదట అల్లు అర్జున్ తో, తర్వాత ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. 'ఆదర్శ కుటుంబం' తర్వాత ఆ మైథలాజికల్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: ఈ సీక్వెల్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం