English | Telugu

రొమాన్స్ చేస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది!

యామీ గౌత‌మ్ తెలుసు క‌దా?? మొన్నే తెలుగులో కొరియ‌ర్ బోయ్ క‌ల్యాణ్ అనే సినిమా చేసింది. అంత‌కు ముందు ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించినా పాప‌కు బ్రేక్ రాలేదు. ఆ మూడు సినిమాల్లోనూ ప‌ద్ధ‌తిగానే క‌నిపించింది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ పాప హాట్ జెమ్‌. లిప్ లాక్ స‌న్నివేశాల్లో విచ్చ‌ల‌విడిగా న‌టించేస్తుంది. కెమెరా ముందే కాదు, వెనుకా.. హీరోతో రొమాన్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింద‌ట‌. ప్ర‌స్తుతం యామీ ‘స‌న‌మ్ రే’ అనే హిందీ చిత్రంలో న‌టిస్తుంది.

ఇందులో పుల్కిట్ సామ్రాట్ హీరో.షూటింగ్ స‌మ‌యంలో వీరి మ‌ధ్య స్నేహం కాస్తా ప్రేమ‌గా మారింద‌ట‌. ఇద్ద‌రూ చ‌నువుగా మెలుగుతున్నార‌ట‌. కార్ వ్యాల్‌లోనూ... గంట‌ల త‌ర‌బ‌డి గ‌డుపుతున్నార‌ట‌. అయితే పుల్కిట్‌కి ఆల్రెడీ పెళ్ల‌యింది. పుల్కిట్ స‌తీమ‌ణికి యామీ విష‌యంలో అనుమానం మొద‌లైంది. అందుకే మొన్నామ‌ధ్య స‌డ‌న్‌గా సెట్‌కి వెళ్లింద‌ట‌. లొకేష‌న్లో ఉండాల్సిన హీరో హీరోయిన్లు కేర్ వ్యాన్‌లో సేద‌తీరుతున్నార‌ట‌. ఆమె వెళ్లేస‌రికి... హీరో హీరోయిన్లు ఇద్ద‌రూ స‌ర‌స క‌ల్లాపాల్లో సాగుతున్నార‌ట‌.

దాంతో ఇద్ద‌రూ... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దాంతో... పుల్కిట్ శ్రీ‌మ‌తి గ‌గ్గోలు పెట్టింద‌ట‌. సెట్లో అర‌చి గీ పెట్టింద‌ట‌.. యామికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చి మ‌రీ వెళ్లింద‌ని తెలుస్తోంది. దాంతో కొన్ని రోజుల నుంచి యామీ షూటింగ్‌కి కూడా రావ‌డం లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలిపెట్ట‌న‌ని యామీ ప‌రువు తీస్తాన‌ని పుల్కిట్ భార్య బెదిరిస్తోంది. పాపం.. యామీ... అడ్డంగా బుక్క‌యిపోయింది క‌దూ!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.