English | Telugu

సిబిఐ ముందుకు హీరో విశాల్..అభిమానుల్లో కలవరం 

విశాల్ డ్యూయల్ రోల్ లో నటించగా ఇటీవల తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మార్క్ అంథోని. ఈ చిత్రం తమిళనాట హిట్ అవ్వగా తెలుగులో మాత్రం అంతగా ఆడలేదు. విశాల్ సరసన అభినయ, రీతూ వర్మ లు నటించగా ప్రముఖ దర్శకుడు ,నటుడు అయిన ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం గురించి విశాల్ తన ట్విటర్ వేదికగా చేసిన ఒక పోస్ట్ విశాల్ అభిమానులని షాక్ కి గురి చేస్తుంది.

విశాల్ తన మార్క్ ఆంథోనీ మూవీని హిందీలో కూడా విడుదల చెయ్యాలని భావించి హిందీ సెన్సార్ సర్టిఫికెట్ కోసం అడిగితే తనని సెన్సార్ వాళ్ళు డబ్బులు అడిగారని 6 లక్షలు రూపాయలు చెల్లించారని విశాల్ ఆరోపణ చేసిన విషయం అందరికి తెలిసిందే. విశాల్ చెప్పిన ఈ న్యూస్ భారతీయ చిత్రపరిశ్రమ మొత్తాన్ని షేక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు విశాల్ హిందీ చిత్ర సీమకి చెందిన సెన్సార్ వాళ్ళ మీద చేసిన ఆరోపణలకి సంబంధించి సిబిఐ ముందు హాజరవుతున్నాడు. ఈ విషయాన్నే విశాల్ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తు నేను నా మార్క్ ఆంథోనీ మూవీ విషయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి చెందిన సెన్సార్ వాళ్ళకి లంచం ఇచ్చానని చేసిన ఆరోపణల మీద ముంబై సి బి ఐ ఆఫీస్ కి వెళ్తున్నానని పోస్ట్ చేసాడు.

ఇప్పుడు విశాల్ చేసిన ఆ పోస్ట్ ని చూసిన ఫాన్స్ లో కలవరం మొదలయ్యింది. అలాగే కొంత మంది అభిమానులు అయితే విశాల్ కి అండగా ఉంటామని ఈ కేసు విషయం లో ఆయనతో పాటు ఎంతవరకైనా నడవడానికి సిద్ధం అని కూడా అంటున్నారు.మార్క్ ఆంథోనీ కి విశాల్ నే నిర్మాత.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.