English | Telugu

ఫిభ్రవరి 26న ‘వీరి వీరి గుమ్మడిపండు’

దుగ్గిన్‌ సమర్పణలో శివకృతి క్రియేషన్స్‌ బ్యానర్‌పై రుద్ర, వెన్నె, సంజయ్‌, బంగారం ప్రధానతారాగణంగా రూపొందిన చిత్రం ‘వీరి వీరిగుమ్మడిపండు’. ఎం.వి.సాగర్‌ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు ఎం.వి.సాగర్, నిర్మాత కెల్లం కిరణ్ కుమార్, హీరో రుద్ర, హీరోయిన్ వెన్నెల, రుశ్వేత, హార్డికేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

దర్శకుడు ఎం.వి.సాగర్‌ మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌. ప్యాడిరగ్‌ ఆర్టిస్టులు కొంత మంది మినహా 63 మంచి కొత్తవాళ్ళే ఈ సినిమాకు పనిచేశారు. హీరో రుద్రనే సంగీత దర్శకుడు పి.ఆర్‌ను పరిచయం చేశారు. పి.ఆర్‌. మంచి సంగీతాన్నందించారు. ప్రేమకథాచిత్రమ్, గీతాంజలి, రాజుగారి గది చిత్రాల తరహాలో ఈ ఏడాది వీరివీరి గుమ్మడిపండు సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది. సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. తప్పకుండా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. నిర్మాత కెల్లం కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న యూనిట్‌ ఈ సినిమా కోసం వర్క్‌ చేసింది. సినిమా బాగా వచ్చింది. సినిమా ఫిభ్రవరి 26న విడుదల చేస్తున్నాం. తప్పకుండా డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.