English | Telugu

ఉద‌యభానుకు చిరు, బాల‌య్య ఝ‌ల‌క్‌!


ఉద‌య‌భాను యాంక‌రింగు మాటేమో గానీ, ఎగ‌స్ట్రాలు మాత్రం బాగానే చేస్తుంది. వీక్ష‌కుల‌కు హుషారు తెప్పించాల‌న్న ఉద్దేశంతో కాస్త‌ ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటుంది. ఉద‌య‌భాను స్పీడు మాత్రం వేదిక‌పై ఉన్న‌వారికి త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతుంది. ఆదివారం రాత్రి జ‌రిగిన టీ ఎస్ ఆర్ అవార్డుల కార్య‌క్ర‌మంలో ఉద‌య‌భాను వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అల‌వాటు ప్ర‌కారం ఇక్క‌డా... త‌న ఓవ‌రాక్ష‌న్ చూపించింది.

ఉత్తమ న‌టుడిగా అవార్డు అందుకొన్న అనంత‌రం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో ప్రామ్టింగ్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించింది భాను. ముందు కాస్త లైట్‌గా తీసుకొన్నా, త‌రువాత మాత్రం బాల‌య్య సీరియ‌స్ అయ్యాడు. 'ఆపు.. నేను చెప్తా..' అని సీరియ‌స్ గా ఉద‌య‌బాను వంక చూశాడు.. ఆ త‌ర‌వాత తేరుకొని చిరు న‌వ్వు చిందించాడు. చిరంజీవి విష‌యంలో ఉద‌య‌భాను కాస్త అతిగా స్పందించింది. 'చిరు సార్ 150వ సినిమా ఎప్పుడు' అని సంద‌ర్భం లేకుండా చిరుని ఒక‌ట్రెండు సార్లు అడిగింది. అందుకు చిరు కాస్త సీరియ‌స్‌గానే 'ఆగు..' అన్న‌ట్టు సంజ్ఞ చేశాడు. దాంతో ఉద‌య‌బాను స్పీడుకు బ్రేకులు ప‌డ్డాయి.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.