English | Telugu

2025 రౌండప్.. సర్ ప్రైజ్ చేసిన కొత్త దర్శకులు.. మీ ఫేవరెట్ ఎవరు?

2025కి శుభం కార్డు పడినట్టే. ఈ ఏడాది పెద్ద సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయాయి కానీ.. చిన్న సినిమాలతో కొందరు కొత్త దర్శకులు సర్ ప్రైజ్ చేశారు. పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల మెప్పుపొందడమే కాకుండా, ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చి పెట్టాయి. ఈ ఏడాది తమ తొలి సినిమాతోనే విజయాన్ని అందుకొని, అందరి దృష్టిని ఆకర్షించిన కొత్త దర్శకులు ఎవరంటే..?

న్యాచురల్ స్టార్ నానికి చెందిన 'వాల్ పోస్టర్ సినిమా బ్యానర్'లో రూపొందిన 'కోర్ట్'(Court) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామ్ జగదీష్. పోక్సో యాక్ట్ నేపథ్యంలో రూ.5 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. రూ.55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో రామ్ జగదీష్ ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, నాని బ్యానర్ లోనే మరో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.

ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద సర్ ప్రైజ్ అంటే 'లిటిల్ హార్ట్స్'(Little Hearts) అని చెప్పవచ్చు. ఈటీవీ విన్‌ తో కలిసి ఆదిత్య హాసన్‌ నిర్మించిన ఈ సినిమాతో.. సాయి మార్తాండ్‌ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. రొమాంటిక్ కామెడీ జానర్ లో కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ ఫిల్మ్.. దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి మార్తాండ్‌ తో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'కె ర్యాంప్'(K-Ramp)కి నూతన దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమా.. యూత్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది.

సున్నిత హాస్యంతో తెరకెక్కి చక్కిలిగింతలు పెట్టిన చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'(The Great Pre Wedding Show). ఈ మూవీతో రాహుల్ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. ఓటీటీలో అంతకు రెట్టింపు రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

'లిటిల్ హార్ట్స్' తర్వాత ఈటీవీ విన్ నుండి వచ్చిన మరో మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai). ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారగా, సాయిలు కంపాటి (బోస్) దర్శకుడిగా పరిచయమయ్యాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా రా లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ.. కంటెంట్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

Also Read: 2025 రౌండప్.. బాక్సాఫీస్ విన్నర్ ఎవరు?

వరుస ఫ్లాప్స్ ని ఎదుర్కొంటూ, మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఫిల్మ్ 'శంబాల'(Shambhala). ఈ మిస్టిక్ థ్రిల్లర్ కి కొత్త దర్శకుడు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. మొదటి సినిమాతోనే.. కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు.

ఈ ఏడాది విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాల్లో 'దండోరా'(Dhandoraa) ఒకటి. కుల‌వివ‌క్ష అనే సున్నితమైన అంశాన్ని తీసుకొని, భావోద్వేగాలతో కట్టిపడేశాడు నూతన దర్శకుడు మురళికాంత్.

అలాగే, 'గాంధీ తాత చెట్టు'తో పద్మావతి మల్లాది, 'రామం రాఘవం'తో ధనరాజ్, 'కన్యాకుమారి'తో సృజన్ అట్టాడ, 'సుందరకాండ'తో వెంకటేష్ నిమ్మలపూడి, 'పతంగ్'తో ప్రణీత్‌ ప్రత్తిపాటి కూడా డైరెక్టర్స్ గా మంచి మార్కులే కొట్టేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.