English | Telugu

పద్మాలయాలో మహేష్ బాబు, సమంతల దూకుడు

పద్మాలయాలో మహేష్ బాబు, సమంతల "దూకుడు" చిత్రం యొక్క షూటింగ్ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, "ఏమాయ చేసావే, బృందావనం" చిత్రాల ఫేం సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం"దూకుడు". మహేష్ బాబు సమంతల "దూకుడు" సినిమా ఏప్రెల్ 23 నుంచి పద్మాలయా స్టుడియోలో షూటింగ్ జరుపుకోనుందని తెలిసింది. అది కూడా ఫెడరేషన్ వాళ్ళు స్ట్రైక్ విరమిస్తేనే, మహేష్ బాబు సమంతల "దూకుడు" మూవీ షూటింగ్ పద్మాలయా స్టుడియోలో జరిగే అవకాశాలున్నాయి.

అంతే కానీ ఫెడరేషన్ వారు గనక సమ్మె కొనసాగిస్తే మాత్రం మహేష్ బాబు సమంతల "దూకుడు" మూవీ షూటింగ్ పద్మాలయా స్టుడియోలో జరిగే అవకాశాలు లేనట్లే. ఫెడరేషన్ కూ, తెలుగు సినీ నిర్మాతలకూ మధ్య సయోధ్య కుదిరినట్లేననీ, నిన్న శుక్రవారం అంటే ఏప్రెల్ 22 వ తేదీకల్లా సమస్యలన్నీ పరిష్కారమవుతాయనీ, సమ్మె విరమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ పెద్దలంటున్నారు. కానీ ఆలక్షణాలేవీ ఇప్పటివరకూ కనిపించటం లేదు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.