English | Telugu

సుమంత్ హీరోగా రవి చావలి చిత్రం

సుమంత్ హీరోగా దర్శకుడు రవి చావలి ఒక చిత్రం ప్రారంభించనున్నారు. సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మించగా, ఇటీవల విడుదలైన "రాజ్" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈసారి రవిచావలి దర్శకత్వంలో సుమంత్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన థ్రిల్లర్ మూవీలో నటించటానికి అంగీకరించారట. ఈ సుమంత్ హీరోగా రవి చావలి చిత్రం వచ్చే నెలలో అంటే ఏప్రెల్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

ఈ సుమంత్ హీరోగా మూవీ ప్రారంభించనున్న రవి చావలి గతంలో సామాన్యుడు వంటి చక్కని చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సామాన్యుడు సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాక ఈ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చినట్టుంది. మరి అలాంటి దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో, సుమంత్ హీరోగా నటించే చిత్రం గురించి హీరో సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నారట.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.