English | Telugu

కాపీ కొట్టి కోట్లు సంపాదిస్తున్నాడు

ఈ రోజుల్లో సేల్ బుల్ ఐడియా దొరికితే చాలు. అది సొంత‌మా? ఎక్క‌డ్నుంచైనా కాపీ కొట్టాడా అన్న‌ది అన‌వ‌స‌రం. ఈమ‌ధ్య కాలంలో భారీ హిట్ల‌యిన సినిమాల్నీ దాదాపుగా అక్క‌డ్నుంచో, ఇక్క‌డ్నుంచో కాపీ కొట్టి ఎత్తేసిన‌వే. అంతెందుకు ఆఖ‌రికి బాహుబ‌లికీ కాపీ మ‌ర‌క అంటింది. శ్రీ‌మంతుడు క‌థ నాదే అని ఒక‌రు మీడియాకెక్కారు.

అఖిల్ మూవీ బేస్ లైన్ కూడా ఓ హాలీవుడ్ సినిమాకి ఇన్సిప్రేష‌న్ అన‌బ‌డే కాపీ. భ‌జ‌రంగీ భాయ్ జాన్ సినిమా.. ప‌సివాడి ప్రాణం నుంచి స్ఫూర్తి పొందిందే. ఇప్పుడు కుమారి 21 ఎఫ్‌కీ కాపీ మ‌ర‌క అంటింది. గ‌ళ్ నెక్ట్స్ డోర్ అనే ఇంగ్లీష్ సినిమా నుంచి సుక్కు లైన్ ఎత్తేశాడు. అదొక్క‌టేనా అంటే ఇంకా ఉంది. ప‌తాక సన్నివేశాల్ని అర్జెంటీనా మూవీ సీక్రెట్ ఇన్ డెయిర్ ఐస్ అనే సినిమా నుంచి సుక్కు కాపీ కొట్టాడ‌ట‌. లీలా డిట్ కా అనే ఫ్రెంచ్ మూవీ నుంచి కూడా సుక్కు కొన్ని సీన్లు ఎత్తేశాడ‌ట‌.

ఏదైతేనేం... ఇవ‌న్నీ క‌లిసి ఓ కిచిడీ వండాడు సుకుమార్‌. దానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నారు. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌లో ప‌డిపోయింది. సోమ‌వారం నుంచి వ‌చ్చింద‌తా లాభ‌మే. మొత్తంగా సుకుమార్ ఈ సినిమా నుంచి దాదాపుగా 5 కోట్ల లాభాన్ని ఆర్జించే అవ‌కాశం ఉంద‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. అంటే కాపీ క‌థ‌కు 5 కోట్లు ఆర్జిస్తున్నాడ‌న్న‌మాట‌. అంత‌కంటే ఏం కావాలి?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.