English | Telugu

కొర‌టాలకు కిక్కు నెత్తికెక్కిందా?

విజ‌యంతో పాటు 'విన‌యం' కూడా కల‌సి రావాలి అనిచెప్తుంటారు పెద్ద‌లు. విజ‌యం తాలుకు గ‌ర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకుండా, ఎన్ని విజ‌యాలొస్తే అంత త‌లొగ్గి ఉండ‌డ‌మే అస‌లు సిస‌లైన విజేత ల‌క్ష‌ణం. అయితే ఈ టైపు క్యారెక్ట‌ర్ల‌ను తెలుగు చిత్ర‌సీమ‌లో అరుదుగానే క‌నిపిస్తుంటారు. ఒక్క హిట్టు ప‌డ‌గానే అంతా తామే చేసిన‌ట్టు పోజులు కొడుతుంటారు. త‌మ వెనుకే ప్ర‌పంచం ప‌రుగులు పెడుతున్న‌ట్టు ఫీలైపోతుంటారు. ఇప్పుడు కొర‌టాల శివ‌కూ అలాంటి కిక్కే నెత్తిమీద ఎక్కిందా అనిపిస్తుంటుంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ్రీ‌మంతుడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర దూసుకెళ్లిపోతుంది. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కూ మార్కులు ప‌డ్డాయి.

ఆ మాత్రం చేత ఆ సినిమాలో లోపాలు లేక‌పోలేదు క‌దా. ఇదే విష‌యం కొర‌టాల‌ని అడిగితే ఆయ‌న‌కు కాస్త కోపం వ‌చ్చింది. త‌ల‌తిక్క స‌మాధానాల‌తో పాత్రికేయుల్ని కాసేపు తిక‌మ‌క‌పెట్ట‌డానికి ట్రై చేశారాయ‌న‌. ఆదివారం హైద‌రాబాద్ లో శ్రీ‌మంతుడు ప్రెస్ మీట్ జ‌రిగింది. క‌న్న‌కొడుకు ఎక్క‌డికెళ్లాడో, ఏం చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్య‌త తండ్రికి ఉండదా? ఆ పాయింట్‌ని ఎందుకు మిస్ అయ్యారు అన్న ఓ పాత్రికేయుడి ప్ర‌శ్న‌కు కాస్త వెట‌కారంగా, ఇంకాస్త ఘాటుగా స‌మాధానం ఇచ్చాడు కొర‌టాల‌. అలాంటి సీన్ల‌న్నీ చేరిస్తే సినిమా తొమ్మిది గంట‌ల‌వుతుందండీ. అంత అవ‌స‌ర‌మా?? అని ఎదురు ప్ర‌శ్నించాడు. మ‌రో ప్ర‌శ్న‌కు రైతు కూలీలు ఊరు వ‌దిలి వెళ్ల‌కూడ‌దు, వెళితే నేనైతే కొట్టి ఆపుతా.. అన్నాడు. ఈ స‌మాధానాలే చెబుతాయి ఈ ద‌ర్శ‌కుడికి విజ‌యాల కిక్కు ఎక్కేసింద‌ని. అయితే మ‌రో వైపు మ‌హేష్ మాత్రం అన్నింటికీ న‌వ్వుతూ, చాలా బ్యాలెన్స్‌గా స‌మాధానాలు చెప్పుకొచ్చాడు. సూప‌ర్ స్టార్లు ఊర‌కే అవుతారా. ఈ విష‌యం కొర‌టాల ఎప్పుడు తెలుసుకొంటాడో.?

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.