English | Telugu

బాలీవుడ్ లో శ్రీలీలకి మరో బంపర్ ఆఫర్!..జాన్వీ కపూర్ ప్లేస్ కబ్జా  

బాలీవుడ్ లో శ్రీలీలకి మరో బంపర్ ఆఫర్!..జాన్వీ కపూర్ ప్లేస్ కబ్జా  

'పెళ్లిసందడి'తో ఎంట్రీ ఇచ్చిన 'శ్రీలీల'(Sreeleela)పుష్ప 2లో చేసిన 'కిస్సిక్' సాంగ్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ ని సంపాదించింది. హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా, ఆ ఒక్క సాంగ్ తన సినీ జర్నీకి కొత్త జోష్ ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విజయం ఇచ్చిన గుర్తింపుతోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టి స్టార్ హీరో 'కార్తీక్ ఆర్యన్' తో కలిసి 'ఆషీకీ 3 ' లో చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 

రీసెంట్ గా శ్రీలీల కి హిందీ చిత్రసీమ నుంచి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అగ్ర దర్శకుడు,అగ్ర నిర్మాత కరణ్ జోహార్(Karan Johar)తన ధర్మ ప్రొడక్షన్స్ పై 'దోస్తానా 2(Dostana 2)నిర్మిస్తున్నాడు. విక్రమ్ మాస్సే, లక్ష్య హీరోలుగా చేస్తున్నారు. ఇందులోనే హీరోయిన్ గా శ్రీలీల చెయ్యబోతునట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో కథనాలు వినిపిస్తున్నాయి. మేకర్స్ శ్రీలీల ని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. నిజానికి ఈ మూవీని తొలుత కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్ తో ప్లాన్ చేసారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత వేరే కాస్టింగ్ ఉంటుందని ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది.

2008 వ సంవత్సరంలో వచ్చిన 'దోస్తానా 'కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం హీరోలుగా చెయ్యగా ప్రియాంకచోప్రా హీరోయిన్ గా చేసింది. ఒక ఫేమస్ అపార్ట్మెంట్ లో అద్దెకి ఉండటం కోసం స్వలింగ సంపర్కులుగా అభిషేక్, జాన్ అబ్రహం నటిస్తారు. ఆ తర్వాత అదే అపార్ట్మెంట్ లోకి  ప్రియాంక చోప్రా రావడంతో ఆమె ప్రేమ పొందటం కోసం ఇద్దరు పోటీ పడతారు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి. మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రియాంక చోప్రా అగ్ర హీరోయిన్ గా ఎదగడానికి కూడా ఎంతగానో హెల్ప్ అయ్యింది. ఈ క్రమంలో శ్రీలీల సీక్వెల్ లో నటించడం ఖాయమైతే  బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.