English | Telugu

బాలీవుడ్ లో శ్రీలీలకి మరో బంపర్ ఆఫర్!..జాన్వీ కపూర్ ప్లేస్ కబ్జా  

'పెళ్లిసందడి'తో ఎంట్రీ ఇచ్చిన 'శ్రీలీల'(Sreeleela)పుష్ప 2లో చేసిన 'కిస్సిక్' సాంగ్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ ని సంపాదించింది. హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా, ఆ ఒక్క సాంగ్ తన సినీ జర్నీకి కొత్త జోష్ ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విజయం ఇచ్చిన గుర్తింపుతోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టి స్టార్ హీరో 'కార్తీక్ ఆర్యన్' తో కలిసి 'ఆషీకీ 3 ' లో చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

రీసెంట్ గా శ్రీలీల కి హిందీ చిత్రసీమ నుంచి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అగ్ర దర్శకుడు,అగ్ర నిర్మాత కరణ్ జోహార్(Karan Johar)తన ధర్మ ప్రొడక్షన్స్ పై 'దోస్తానా 2(Dostana 2)నిర్మిస్తున్నాడు. విక్రమ్ మాస్సే, లక్ష్య హీరోలుగా చేస్తున్నారు. ఇందులోనే హీరోయిన్ గా శ్రీలీల చెయ్యబోతునట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో కథనాలు వినిపిస్తున్నాయి. మేకర్స్ శ్రీలీల ని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. నిజానికి ఈ మూవీని తొలుత కార్తీక్ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్ తో ప్లాన్ చేసారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత వేరే కాస్టింగ్ ఉంటుందని ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది.

2008 వ సంవత్సరంలో వచ్చిన 'దోస్తానా 'కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం హీరోలుగా చెయ్యగా ప్రియాంకచోప్రా హీరోయిన్ గా చేసింది. ఒక ఫేమస్ అపార్ట్మెంట్ లో అద్దెకి ఉండటం కోసం స్వలింగ సంపర్కులుగా అభిషేక్, జాన్ అబ్రహం నటిస్తారు. ఆ తర్వాత అదే అపార్ట్మెంట్ లోకి ప్రియాంక చోప్రా రావడంతో ఆమె ప్రేమ పొందటం కోసం ఇద్దరు పోటీ పడతారు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి. మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రియాంక చోప్రా అగ్ర హీరోయిన్ గా ఎదగడానికి కూడా ఎంతగానో హెల్ప్ అయ్యింది. ఈ క్రమంలో శ్రీలీల సీక్వెల్ లో నటించడం ఖాయమైతే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.