English | Telugu

సంక్రాంతికి వ‌స్తున్నాం…కొడుతున్నాం: నాగార్జున

కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా.రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నాయికలు. కల్యాణ్‌ కృష్ణ దర్శకుడు. నాగార్జున, పి.రామ్మోహన్‌ నిర్మాతలు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందించారు శుక్రవారం శిల్పకళావేదికలో పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఇందులో నాగార్జున పంచెకట్టు చూస్తే ‘దసరాబుల్లోడు’ చిత్రంలో ఏఎన్నార్‌ గుర్తొచ్చారు. ట్రైలర్‌ చాలా బావుంది. కచ్చితంగా ‘దసరాబుల్లోడు’ తరహాలో సక్సెస్‌ అవుతుంది’’ అని అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ ‘‘అభిమానుల్ని కలిసి రెండేళ్లయింది. ‘మనం’తో పెద్ద హిట్‌ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత దానిని మించిన సినిమా చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో రామ్మోహన్‌ ఈ కథ చెప్పాడు. కల్యాణ్‌ కృష్ణ చక్కగా తీర్చిదిద్డాడు. నాన్న‌గారు అనురాగం, అత్మీయ‌త‌, అనుబంధాలు, ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఇలాంటి సినిమాల‌నే చేసి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాంటి సినిమాకు హ‌లోబ్ర‌ద‌ర్ లాంటి ఎంట‌ర్‌ట్‌న్‌మెంట్‌ను యాడ్ చేస్తే ఎలా ఉంటుందోన‌ని ఆలోచ‌న‌తో ఈ సినిమా చేశాం. తెలుగువారికి ఇష్ట‌మైన పండుగ సంక్రాంతి. ప‌చ్చ‌ద‌నం, తియ్య‌ద‌నం అన్నీ క‌లిసి ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో కూడా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. అనూప్‌ ఎప్పటిలానే వినసొంపైన పాటలు సమకూర్చారు. సంక్రాంతికి వ‌స్తున్నాం…కొడుతున్నాం’’ అని అన్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.