English | Telugu

చిరంజీవి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో  తీవ్ర విషాదం 

తొంభయ్యవ దశకంలోనే తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్ని నిర్మించిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి(Shyam Prasad Reddy)సౌందర్య ,సురేష్ లు జంటగా రమ్యకృష్ణ అమ్మవారిగా చేసిన అమ్మోరు(ammoru)సినిమానే అందుకు ఉదాహరణ.ఆ తర్వాత వచ్చిన అరుంధతి(arundathi)కూడా ఎంతటి చరిత్రని సృష్టించిందో అందరకి తెలిసిందే . ఒక రకంగా గ్రాఫిక్స్ కి స్టార్ డమ్ తీసుకొచ్చింది కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నే. ఇప్పుడు ఆయన ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య పేరు వరలక్ష్మి. గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె అందుకు సంబంధించిన ట్రీట్ మెంట్ ని కూడా తీసుకుంటుంది. కానీ చివరకి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు దీంతో శ్యాం ప్రసాద్ రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరలక్ష్మి గారి వయసు అరవై రెండు సంవత్సరాలు. ఆమె సమైక్య ఆంధ్రప్రదేశ్ కి సిఎం గా పని చేసిన కోట్ల విజయభాస్కర రెడ్డి గారి ముగ్గురు కూతుళ్ళల్లో ఒకరు.ఆమె సోదరుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరుపున ఎంఎల్ఏ గా ఉన్నారు.

ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ప్రముఖ నిర్మాత, రచయిత అయిన ఎంఎస్ రెడ్డి(msreddy)కూడా కొంత కాలం క్రితం చనిపోయారు.ఆయన కలం పేరు మల్లెమాల.. ఆ పేరుతోనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం పలు టి వి షోస్ ని నిర్మిస్తున్నారు.పైగా అవన్నీ బుల్లి తెర ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాయి. జబర్దస్త్ నే అందుకు ఉదాహరణ.చిరంజీవి హీరోగా వచ్చిన అంజి కి కూడాశ్యామ్ ప్రసాద్ రెడ్డి నే నిర్మాత.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.