English | Telugu

శంకర్ 'ఐ' 5 రోజుల కలెక్షన్స్

సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన శంకర్ 'ఐ' సినిమా అనుకున్నంత ఆకట్టుకోలేకపోయిందని విమర్శకులు అంటున్నా..పండగ సీజన్‌ని మాత్రం బాగా క్యాష్ చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఈ సినిమా హక్కులు 30 కోట్లకు దక్కించుకోగా, మొదటి ఐదు రోజులలలో ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి 20కోట్లు వసూళ్ళు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలుకానుంది. పండగ సీజన్ అయిపోవడంతో ఈ సినిమా కలేక్షన్లు ఎలా వుంటాయనేది ఆసక్తికరంగా మారింది. శంకర్ ఐ సినిమా 5 రోజుల కలెక్షన్స్ ఇలా వున్నాయి.

నైజాం రూ. 6.32 కోట్లు
సీడెడ్ రూ. 4.15 కోట్లు
వైజాగ్ రూ. 1.77 కోట్లు
ఈస్ట్ గోదావరి రూ. 1.60 కోట్లు
వెస్ గోదావరి రూ. 1.31 కోట్లు
కృష్ణా రూ. 1.39 కోట్లు
గుంటూరు రూ. 1.90 కోట్లు
నెల్లూరు రూ.1.03 కోట్లు
తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి రూ. 19.47 కోట్లు

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.