English | Telugu

ఆమెకు పైసా కూడా ఇవ్వ‌లేద‌ట‌




అఖిల్ సినిమా కోసం అఖిల్ దాదాపుగా రూ.6 కోట్ల పారితోషికం అందుకొన్నాడ‌ని టాక్‌. వినాయ‌క్ కి అయితే ఏకంగా రూ.12 కోట్లు అప్ప‌గించార‌ట‌. మ‌రి సాయేషాకు ఎంతిచ్చారు?? ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగ‌ల్‌కి ఇదే తొలి సినిమా. ఆమె కూడా ఉన్న‌త `న‌ట‌` కుటుంబం నుంచి వ‌చ్చిన అమ్మాయే. త‌న‌కీ భారీ ఎత్తున పారితోషికం ఇచ్చుంటార‌ని అనుకొంటారు. అయితే.. అంత సీన్ లేదిక్క‌డ‌. సాయేషాకు ఒక్క పైసా పారితోషికం కూడా ఇవ్వ‌లేదట‌. `సినిమా పూర్త‌య్యాక నీ పారితోషికం కోసం ఆలోచిద్దాం` అని చెప్పిన ద‌ర్శ‌క నిర్మాత‌లు.. అఖిల్ విడుద‌ల‌కు ముందే చేతులెత్తేశార‌ట‌. క‌నీసం త‌న‌కు ప‌బ్లిసిటీ కూడా ఇవ్వ‌లేద‌ని సాయేషా తెగ ఫీలైపోయింద‌ని స‌మాచారం. ఆఖ‌రికి త‌న ఇంట‌ర్వ్యూల‌ను సొంత డ‌బ్బులు ఖ‌ర్చు చేసింద‌ట‌. సెట్లో మ‌హారాణిలా చూసుకొన్నార‌ని, అయితే సినిమా పూర్త‌వ్వ‌గానే త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని, క‌థ చెబుతున్న‌ప్పుడు త‌న పాత్ర ఒక‌లా ఉంద‌ని, తెర‌పై చూసుకొంటే మ‌రోలా క‌నిపించింద‌ని, అఖిల్ పాత్ర ఎలివేట్ చేయ‌డానికి త‌న పాత్ర‌ని తొక్కేశార‌ని తెగ ఫీల‌వుతోంద‌ట సాయేషా. ఏరు దాటాక తెప్ప త‌గ‌లేయ‌డం అంటే ఇదే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.