English | Telugu

అనుష్క కెరీర్‌తో ఆడుకొంటున్నాడా??



రుద్ర‌మ‌దేవి సినిమాపై గుణ‌శేఖ‌ర్ మాత్ర‌మే కాదు, అనుష్క కూడా గంపెడాశ‌లు పెట్టుకొంది. ఈ సినిమా కోసం లెక్క‌లేన‌న్ని కాల్షీట్లు ఇచ్చింది. `మీరు ఎప్పుడు పిలిచినా షూటింగ్ కి వ‌స్తా` అంటూ గుణ‌కి భారీ ఆఫ‌ర్ ఇచ్చింది. చెప్పిన‌ట్టే రెండేళ్ల పాటు విరామం లేకుండా ఈసినిమాకే అంకిత‌మైపోయింది. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ప‌బ్లిసిటీ విష‌యంలో గుణ‌కు అనుష్క మొండి చేయి ఇచ్చేసింది. `ఒక్క‌రోజు ఆఫీసుకు వ‌చ్చి ఇంట‌ర్వ్యూలు ఇవ్వు..` అని గుణ అడిగినా `డోన్ట్ కేర్‌..` అంటోందట‌. అంత‌లోనే ఎంత మార్పు?? అనుష్క ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తోంది??

రుద్ర‌మ‌దేవి డిలే విష‌యంలో అనుష్క ఏమాత్రం హ్యాపీగా లేద‌ని ఇండ్ర‌స్ట్రీ టాక్‌. ఏప్రిల్‌లో విడుద‌ల కావాల్సిన ఈసినిమా వాయిదాల‌పై వాయిదాలు వేసుకొంటూ వెళ్తోంది. అక్టోబ‌రు 9న విడుద‌ల చేస్తాన‌ని గుణ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించినా.. ఆ రోజుకూడా ఈ సినిమా వ‌స్తుందో రాదో అని డౌట్‌. ఇప్ప‌టికే అనుష్క ఓ విడ‌తలో మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చేసింది. విడుద‌ల‌కు ముందు మ‌రోసారి ఇంట‌ర్వ్యూలు ఇవ్వాల్సివ‌స్తుంద‌ని గుణ‌శేఖ‌ర్ చెప్పాడ‌ట‌. దాంతో అనుష్క గుణ‌పై సీరియ‌స్ అయ్యింద‌ని టాక్‌. ''నా కెరీర్‌తో ఆట‌లాడొద్దు. ఇప్ప‌టికే సినిమా డిలే అయ్యింది. మీ వ‌ల్ల చాలా సినిమాలు వ‌దులుకొన్నా. ఇక ఒక్క‌రోజు కూడా ఈసినిమా కోసం కేటాయించ‌లేను'' అని మొహంమీదే చెప్పేసింద‌ట‌.

రుద్ర‌మ‌దేవి ఆల‌స్యం అవ్వ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా గుణ‌శేఖ‌ర్‌కే కాదు, అనుష్క‌కీ న‌ష్ట‌మే. ఈసినిమా ఫ్లాప్ అయితే గుణ ఆర్థికంగా న‌ష్ట‌పోతాడు. ఈ ఫ్లాప్ ప్ర‌భావం అనుష్క‌పైన కూడా భారీగా ప‌డబోతోంది. అందుకే.. ఈ సినిమా డిలే అవ్వ‌డం అనుష్క‌కి ఏమాత్రం ఇష్టం లేద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాని ఎన్నిసార్లు వాయిదా వేస్తున్నా ఓపిగ్గా భ‌రించిన అనుష్క‌... అక్టోబ‌రు 9కి ఈ సినిమా మార్చ‌డంతో.. త‌ట్టుకోలేక‌పోతోందట‌. ఎందుకంటే అక్టోబ‌రు 2న సైజ్ జీరో సినిమా విడుద‌ల చేయాల‌న్న‌ది పీవీపీ ప్లాన్‌. అక్టోబ‌రు 9న రుద్ర‌మ వ‌స్తే.. వాళ్లూ డేట్ మార్చుకోక త‌ప్ప‌దు. అంటే రుద్ర‌మ‌దేవి వాయిదా.. సైజ్ జీరోపై ప్ర‌భావం చూపిస్తుంద‌న్న‌మాట‌. ఓసారి వాయిదా ప‌డిన సినిమాకి అటోమెటిగ్గా హైప్ తగ్గుతూ వ‌స్తుంది. సో.. గుణ నిర్ణ‌యాల వ‌ల్ల అనుష్క రెండు విధాలా న‌ష్ట‌పోతోంద‌న్న‌మాట‌. అందుకే పాపం... గుణ‌పై అనుష్క‌కి అంత కోపం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.