English | Telugu

తమిళనాడు రాజకీయాల్లోకి  రోజా ఎంట్రీ? రెడీ అంటున్న రజనీ ఫ్యాన్స్ 

రోజా(roja)తొంభైయ్యవ దశకంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అసభ్య చేష్టలతో , పదజాలంతో ఉన్న పేరుని మొత్తం పోగొట్టుకొని ప్రతి ఒక్కరి నుంచి విమర్శలు ఎదుర్కొంది. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికలో ఘోర పరాజయాన్ని చవి చూసి ఏ రోజు ఏ ఊళ్ళో ఉంటుందో తనకే తెలియని పరిస్థితిని తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రానున్న రోజుల్లో రోజా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుందనే వార్తలు వస్తున్నాయి.అందుకు శరవేగంగా పావులు కదుపుతోందని కూడా అంటున్నారు. పైగా ఆమె ప్రముఖ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్(vijay)స్థాపించిన తమిళ మున్నేట్ర కజగం లో చేరబోతుందని, నెక్స్ట్ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా చూస్తుందని అంటున్నారు. ఇక రోజా అత్త ఇంటి వారు తమిళనాడు అన్న విషయం అందరకి తెలిసిందే.

ఆమె భర్త ఆర్ కే సెల్వమణి తమిళనాడు కి చెందిన ప్రముఖ డైరెక్టర్. సోషల్ మీడియాలో రోజా తమిళనాడు రాజకీయ వార్త చూస్తున్న రజనీ(rajini kanth)ఫాన్స్ అయితే తమిళనాడు లో రోజాకి రాజకీయ భవిష్యత్తు ఉండదని అంటున్నారు. గతంలో రజనీ ని రోజా విమర్శించిన విషయం తెలిసిందే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.