English | Telugu

రవితేజ, బ్రహ్మానందం మధ్యలో విలన్

మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ బ్రహ్మానందం రామోజీ ఫిల్మ్ సిటీలో విలన్ లతో ఆటాడుకుంటున్నారు. వీరిద్దరి కలిస్తే చేసే హంగామా ఎలా వుంటుందో, ఇది వరకే ఎన్నో సినిమాల్లో సినీ ప్రేక్షకులు చూసే వుంటారు. లేటెస్ట్ గా 'బెంగాల్ టైగర్' సినిమా కోసం కూడా వీరు విలన్ తో ఆడుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆ విషయం విలన్ కి తెలిసేసరికి వీరి వెంట పడ్డారట.

మన మాస్ మహారాజుకు వారిని వె౦టనే కొట్టేస్తే మజా వుండదు కదా. అందుకే వారందని తన చూట్టు ఫిల్మ్ సిటీ మొత్తం తిప్పుకొని, ఆతరువాత చితక్కోట్టాడట. ప్రస్తుత౦ బెంగాల్ టైగర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రవితేజ తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బోమన్ ఇరాని ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.