English | Telugu

మహేష్ శ్రీమంతుడులో నయనతార

మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు సడన్ గా ఈ సినిమాలో నయనతార ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? ఇది వేరే మేటర్లేండి. నయనతార కథానాయికగా నటించిన `మయూరి` ట్రైలర్ ను శ్రీమంతుడు థియేటర్లలో ప్రదర్శించబోతున్నారట. అది మ్యాటర్.

నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకుడిగా తమిళంలో `మాయ` అనే చిత్రం తెరకెక్కింది. అదే చిత్రం తెలుగులో `మయూరి`గా విడుదల కాబోతోంది. ఇందులో నయనతార దెయ్యంగా కనిపించబోతోందట. రెండు భాషల్లోనూ సినిమాని తీశారు. తెలుగు వర్షన్ కి సి.కళ్యాణ్ నిర్మాత. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. ఆగస్టు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ సినిమాని విడుదల చేస్తారు. మహేష్ తో పాటు ట్రైలర్ వస్తోంది కాబట్టి `మయూరి`కి మంచి పబ్లిసిటీనే దక్కబోతోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.