English | Telugu

రామ్ కొత్త ప్రయోగం.. రానా హ్యాండ్ కలిసొస్తుందా?

చాక్లెట్ బాయ్ గా, ఎనర్జిటిక్ హీరోగా రామ్ పోతినేనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తన ఇమేజ్ కి భిన్నంగా కొన్నేళ్లుగా వరుస మాస్ సినిమాలు చేసి పరాజయాలు చూశాడు. చాలా రోజుల తర్వాత తన ఇమేజ్ కి సరిపొయే 'ఆంధ్రా కింగ్ తాలూకా' అనే ఫ్యాన్ బాయ్ స్టోరీ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాడు. ప్రచార చిత్రాల్లో రామ్ లుక్ ఆకట్టుకుంది. ఇలాంటి రామ్ నే కదా తాము చూడాలనుకుంది అంటూ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఆ ఫీడ్ బ్యాక్ మహిమో ఏంటో గానీ.. మాస్ జపం మాని, 'ఆంధ్రా కింగ్ తాలూకా' తరహా ట్రెండీ అండ్ డిఫరెంట్ సినిమాలు చేయాలని రామ్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. (Ram Pothineni)

హీరోగా ఇప్పటిదాకా సుమారుగా 20 సినిమాలు చేసిన రామ్.. కొత్త దర్శకులతో పని చేసింది తక్కువే. 'గణేష్', 'కందిరీగ' వంటి రెండు మూడు సినిమాలు మాత్రమే డెబ్యూ డైరెక్టర్స్ తో చేశాడు. వాటిలో 'కందిరీగ' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి రామ్, చాలా కాలం తర్వాత ఓ నూతన దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కిషోర్ గోపు అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథ ఇంప్రెస్ అయిన రామ్.. అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని.. ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి రానా దగ్గుబాటి నిర్మించనున్నాడట. జనవరిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.