English | Telugu

విజయ్ సినిమాలో విలన్ గా రాజశేఖర్!

టాలీవుడ్ లో పలువురు సీనియర్ హీరోలు విలన్ గా మారుతున్నారు. ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలు.. ప్రతినాయక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో రాజశేఖర్ (Rajasekhar) కూడా చేరబోతున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్నో పవర్ ఫుల్ రోల్స్ పోషించి యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్.. కొన్నేళ్లుగా హీరోగా వెనకబడ్డారనే చెప్పాలి. దీంతో ఆయన విలన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని వినికిడి. విజయ్ దేవరకొండ సినిమాలో రాజశేఖర్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారని సమాచారం.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న 'కింగ్‌డమ్'తో త్వరలో ప్రేక్షకుల పలకరించనున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఆ తర్వాత దర్శకులు రాహుల్ సాంకృత్యాయన్, రవికిరణ్ కోలాతో సినిమాలు చేయనున్నాడు. వీటిలో రవికిరణ్ ప్రాజెక్ట్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'రౌడీ జ‌నార్థ‌న్‌' అనే టైటిల్ ని లాక్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. 'రౌడీ జ‌నార్థ‌న్‌'లో విలన్ గా రాజశేఖర్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజ‌శేఖ‌ర్ తో ఫొటో షూట్ ను కూడా పూర్తి చేశారట. ఇందులో రాజ‌శేఖ‌ర్ క్యారెక్ట‌రైజేష‌న్, గెట‌ప్ కొత్తగా ఉంటాయట. ఆ పాత్రను రవికిరణ్ డిజైన్ చేసిన తీరు అదిరిపోయిందని అంటున్నారు. 'రౌడీ జ‌నార్థ‌న్‌' తర్వాత రాజశేఖర్ ఒక్కసారిగా క్రేజీ విలన్ గా మారిపోవడం ఖాయమని చెబుతున్నారు.

నిజానికి రాజశేఖర్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ, రామ్ వంటి హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో మెరవగా.. ఆ సినిమా పరాజయంపాలైంది. రాజశేఖర్ పాత్రకు కూడా పెద్దగా పేరు రాలేదు. అయితే ఆయన యాంగ్రీ మ్యాన్ ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ విలన్ రోల్ 'రౌడీ జ‌నార్థ‌న్‌'లో పోషిస్తున్నారని, ఈ సినిమాతో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.