English | Telugu

బ‌న్నీ, అజిత్‌తో రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌??

టాలీవుడ్‌కి ఇది దిమ్మ‌తిరిగిపోయే న్యూస్ ఇది. బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి ఎవ‌రితో సినిమా చేస్తాడ‌న్న విష‌యంలో దాదాపుగా ఓ క్లారిటీ వ‌చ్చింది. ఈసారి రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌డానికి స్కెచ్ వేస్తున్నాడ‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందే ఈ చిత్రంలో క‌థానాయ‌కులుగా అల్లు అర్జున్‌, అజిత్‌ల‌ను ఎంచుకొన్నాడ‌ట‌.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ రాసిన క‌థ ఇద్ద‌రు హీరోల్ని డిమాండ్ చేస్తోంద‌ని టాక్‌. తెలుగులో బ‌న్నీ, త‌మిళంలో అజిత్ ల వ‌ల్ల ఈ సినిమా మార్కెట్ అనూహ్యంగా పెరుగుతుంద‌ని రాజ‌మౌళి ప్లాన్‌. సెప్టెంబ‌రులో బాహుబ‌లి 2 మొద‌లువుతుంది. 2016 వేస‌విలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ త‌ర‌వాత ఈ మ‌ల్టీస్టార‌ర్ ని సెట్స్‌పైకి తీసుకెళ్తార‌ని టాక్‌.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.