English | Telugu

రాజ్ తరుణ్ కు అప్పుడే ఆ హీరోయిన్ కావాలంటా..?

వరుసగా మూడు సినిమాలు హ్యాట్రిక్ కొట్టి మంచి జోష్ మీదున్నాడు రాజ్ తరుణ్. ఇక తన కొత్త సినిమా ''సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'' కూడా ఈ శుక్రవారం రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాంటి కుర్ర హీరో ఇప్పుడు సమంత కావాలంటున్నాడంటా.. అ సంగతేంటో ఓ లుక్కేద్దాం.. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు రిలీజవుతున్న సందర్బంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా రాజ్ తరుణ్ ను ఓ ప్రశ్న అడిగారంట విలేకరులు. అదేంటంటే.. అందరూ కొత్త హీరోయిన్లతోనే చేస్తున్నారు.. పాపులర్ హీరోయిన్లతో చేయరా అని.. దానికి రాజ్ తరుణ్ మాత్రం వారితో చేసే రేంజ్ ఇంకా మనకు రాలేదులేండి అని చెప్పారంట. ఒకవేళ వారితో నటించే ఛాన్స్ వస్తే ఎవరితో నటిస్తారు అని అడిగితే దానికి.. నాకు సమంత అంటే చాలా ఇష్టం.. తన మీద నాకు విపరీతమైన క్రష్ ఉంది అని చెప్పాడు. మరి ఈ కుర్రహీరో కోరిక తీరుతుందో లేదో..

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.