English | Telugu

యుద్ధం చెయ్యకుండా సైలెంట్ గా ఉంటారు.. ఏం చెప్పావు పూరి 

స్టార్ డైరెక్టర్ గా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన 'పూరిజగన్నాధ్'(Puri Jagannadh)గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా పూరి మ్యూజింగ్స్(Puri Musings)ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పూరి చెప్పే పలు ఆసక్తికర విషయాలకీ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా స్ట్రాంగ్ పీపుల్, నార్మల్ పీపుల్ కి మధ్య తేడాని చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతు స్ట్రాంగ్ పీపుల్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏ కారణం చేతనైన బాధకి గురయ్యితే గట్టిగా ఏడవరు. అన్యాయం జరిగిందని ఎవరికైనా ఫిర్యాదు చెయ్యడం గాని,వివరణ ఇచ్చుకోవడం గాని చెయ్యరు. డ్రామా, యుద్ధం, ఎవరి అటెన్షన్ కోసమో ఎదురుచూడటం లాంటిది చెయ్యరు. పైగా ఎవరిపైనైనా ద్వేషాన్ని,కోపాన్ని పెట్టుకోరు. ప్రతీకారం తీర్చుకునే ఆలోచన ఉండదు. తనకి జరిగిన అన్యాయాన్ని గుండెల్లోనే పెట్టుకొని కొన్నాళ్ళు అందరకి దూరంగా బతుకుతారు. గతంలో మనుషులని నమ్మినట్టుగా నమ్మరు. పనికిరాని పనుల కోసం, అనవసరమైన మనుషుల కోసం ఎక్కువగా ఆలోచించడం చెయ్యకుండా, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధాలపై కూడా విరక్తి పుట్టవచ్చు. మళ్ళీ ప్రేమించుకోవడానికి, స్నేహం చెయ్యడానికి వందసార్లు ఆలోచిస్తారు. నార్మల్ పీపుల్ ఈ లక్షణాలు నేర్చుకోండని పూరి చెప్పుకొచ్చాడు.

పూరి ప్రస్తుతం 'విజయ్ సేతుపతి'(VIjay Sethupathi)తో తన తదుపరి చిత్రం చెయ్యబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ జులై లేదా, అగస్ట్ లో గాని సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పూరి, ఛార్మికౌర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా మిగతా వివరాలన్నీ త్వరలోనే తెలియనున్నాయి.



టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .