English | Telugu

ఎన్టీఆర్ కోసం జగన్ మాస్టర్ ప్లాన్..!

'ఆంధ్రావాలా' అట్టర్‌ఫ్లాప్‌ తరువాతఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాలేదు. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లలో ఈ కాంబినేషన్‌లో ఎన్నోసార్లు ఇద్దరూ ప్రయత్నించినా కానీ రెండో సినిమా వర్కవుట్‌ కాలేదు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్‌లో మూవీ వస్తోంది. 'ఆంధ్రావాలా' చిత్ర పరాజయానికి ప్రాయశ్చిత్తంగా మరో సినిమాతో హిట్ ఇస్తానని పూరి అప్పుడే ఎన్టీఆర్‌కి మాటిచ్చాడు. దాని కోసం పూరి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడట. ఈ మధ్య తాను రాసిన కథలతో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయేసరికి..ఇప్పుడు బయట కథతో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు పూరి. అలాగే స్క్రిప్ట్ లోని ప్రతి అంశంపైన చాలా శ్రద్ద తీసుకొని మరి రెడీ చేస్తున్నాడట. కమర్షియల్ లెక్కలు వేయడంలో పూరి చాలా సిద్దహస్తుడు. అందుకే ఈసారి ఎన్టీఆర్ తో బాక్స్ ఆఫీస్ నూ కుమ్మెయించడానికి ముందును౦చే రంగం సిద్దం చేస్తున్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.