English | Telugu

నిర్మాత ఏఎం రత్నంకు అస్వస్థత.. అసలేం జరిగింది..?

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) అస్వస్థతకు గురైనట్లు ఈ ఉదయం వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఏఎం రత్నం మూవీ ఆఫీస్ కి వెళ్ళగా.. సడెన్ గా హై బీపీతో కళ్ళు తిరిగి పడిపోయారని న్యూస్ వినిపించింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారని.. చికిత్స అందించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ప్రచారం జరిగింది.

ఏఎం రత్నం ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత దయాకర్ స్పందించారు. "అన్నయ్య ఏఎం రత్నం స్పృహ తప్పి పడిపోయాడనే పుకార్లను నమ్మవద్దు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా ఉండండి." అని దయాకర్ ట్వీట్ చేశారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.