English | Telugu

ప్ర‌భాస్ అడ్డాలో... అదిరిపోయే ర్యాలీ!

బాహుబ‌లి ఫీవ‌ర్ మామూలుగా లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులు ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. అలాంట‌ప్పుడు ప్ర‌భాస్ అడ్డా భీమ‌వ‌రంలో ప‌రిస్థ‌తి మామూలుగా ఉంటుందా? అక్క‌డ ఏకంగా పండ‌గ సంబ‌రాలే చేసుకొంటున్నారు అభిమానులు. గురువారం అర్థరాత్రి బెనిఫిట్ షో పూర్త‌య్యాక 3 ఏనుగులు 40 గుర్రాలు, 150 ఎన్‌ఫీల్డ్ బైకులూ, 5 వేల‌మంది అభిమానుల‌తో భీమ‌వ‌రంలో క‌నీ వినీ ఎరుగని ర్యాలీ నిర్వ‌హించ‌డానికి అభిమానులు స‌న్నాహాలు చేసుకొంటున్నారు.

భీమ‌వ‌రంలోనే కాదు, ఆ చుట్టు ప‌క్క‌న గ్రామాల్లోనూ ఈ ర్యాలీ నిర్వ‌హిస్తారు. అయితే పోలీసు శాఖ మాత్రం ర్యాలీలో ఏనుగుల‌ను తీసుకురావ‌డానికి అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. బాణ సంచా ధాటికి ఏనుగులు చెల్లాచెదుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఒక వేళ ఏనుగుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోతే.. మ‌రో 20 గుర్రాల‌ను స‌మీక‌రించి... ర్యాలీని అట్ట‌హాసంగా జ‌ర‌పాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

మొత్తానికి ఓ సినిమా కోసం ఈ స్థాయిలో ర్యాలీ నిర్వ‌హించ‌డం టాలీవుడ్‌లోనే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. భీమ‌వ‌రం బుల్లోళ్ల హ‌డావుడి చూసి.. నైజాంలో ఉన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్ కూడా ఈ త‌ర‌హా.. ర్యాలీ ఒక‌టి నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.