English | Telugu

త్రివిక్రమ్ ని ప్రశ్నించండి.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

ప్రస్తుతం టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ ఛాంబర్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రముఖ నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. (Poonam Kaur)

గతంలో తాను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ కి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని పూనమ్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని కోరుతున్నట్లు పూనమ్ పేర్కొన్నారు.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా కూడా పూనమ్ స్పందించారు. తనకి సినీ పరిశ్రమ సెట్ కాదని, ఇప్పటిదాకా సినిమా అవకాశాల కోసం ఏ దర్శకుడిని గానీ హీరోని గానీ అప్రోచ్ కాలేదని అన్నారు. దర్శకుడు మరియు రాజకీయాల వల్ల తన కెరీర్ తో పాటు జీవితం కూడా నాశనమైందని పూనమ్ రాసుకొచ్చారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.