English | Telugu

ఎన్టీఆర్ డైరెక్ట్ తమిళ్ మూవీ.. డైరెక్టర్, విలన్ ఎవరో తెలిస్తే షాక్!

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి ఇతర సౌత్ స్టేట్స్ లో.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. దీంతో ఆయన మార్కెట్ ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పుడు ఆ మార్కెట్ ను మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు.

ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ 'దేవర' (Devara) సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఎంతగానో ప్రమోట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అలాగే 'వార్-2' అనే ఓ భారీ బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో మరో భారీ పాన్ ఇండియా మూవీ లైన్ లో ఉంది. ఇప్పటికే 'వార్-2'తో హిందీ మార్కెట్ పై కన్నేసిన ఎన్టీఆర్.. నెక్స్ట్ తమిళ మార్కెట్ పై కన్నేస్తున్నాడు.

'దేవర' ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తాజాగా చెన్నై వెళ్ళగా.. అక్కడ ఆయనకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "నాతో సహా తమిళనాట మిమ్మల్ని అభిమానించేవారు ఎందరో ఉన్నారు. మీ నుంచి డైరెక్ట్ తమిళ సినిమాని ఎప్పుడు ఆశింవచ్చు. అది వస్తే సెలెబ్రేట్ చేసుకుంటాం" అని ప్రెస్ మీట్ లో యాంకర్ అడగగా.. వెంటనే స్పందించిన ఎన్టీఆర్ "నా ఫేవరెట్ డైరెక్టర్‌ను అడుగుతాను. వెట్రిమారన్ సార్ మనం కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నాం. డైరెక్ట్‌ తమిళ్ లో సినిమా చేసి, తెలుగులో డబ్ చేద్దాం" అని చెప్పాడు. దీంతో యాంకర్ తో సహా అక్కడున్నవారు సంతోషంతో కేకలు వేశారు.

కాగా, ఎన్టీఆర్-వెట్రిమారన్ కలయికలో సినిమా ఉంటుందని గతంలోనే వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ కోసం వెట్రిమారన్ ఇప్పటికే ఒక కథ సిద్ధం చేశాడని, అందులో ధనుష్ విలన్ గా నటిస్తాడని ప్రచారం జరిగింది. అందుకే డైరెక్ట్ తమిళ సినిమా అనగానే ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా వెట్రిమారన్ పేరు చెప్పి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'రాయన్' తెలుగు ప్రమోషన్స్ లో ధనుష్ సైతం, తనకు ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చేయాలని ఉందని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఈ ముగ్గురి కలయికలో సినిమా వచ్చినా ఆశ్చర్యంలేదు అనిపిస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.