English | Telugu

ప‌వ‌న్ వ‌ద్దు మొర్రో అంటున్నాడట‌!

క‌త్తి సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ చేస్తున్నాడ‌ట‌, ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం త‌గిన ద‌ర్శ‌కుడిని వెదుతుకున్నాడ‌ట‌... అంటూ టాలీవుడ్‌లో నాలుగైదు రోజుల నుంచి ఎడ‌తెగ‌ని ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ప‌వ‌న్ క‌త్తి సినిమా చూశాడ‌ని, చాలా ఇంప్రెస్ అయ్యాడ‌ని, గబ్బ‌ర్ సింగ్ 2ని కూడా ప‌క్క‌న పెట్టి, ఈ ప్రాజెక్టును చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్టు టాలీవుడ్‌లో చెప్పుకొన్నారు. కానీ అంత సీన్ లేద‌ని తేలిపోయింది. ప‌వ‌న్ ఈ సినిమాని చేయ‌డం లేద‌ని తేలిపోయింది. ఈ సినిమా ప‌వ‌న్ చేస్తానంటే తెలుగులో రీమేక్ చేద్దామ‌ని నిర్మాత ఠాగూర్ మ‌ధు భారీ ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు. ప‌వ‌న్‌కి ఈసినిమా చూపించాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. కానీ ప‌వ‌న్ మాత్రం ''నేను ఈ సినిమా చేయ‌ను మొర్రో'' అంటున్నాడ‌ట‌. మ‌రీ బ‌ల‌వంతం చేస్తే... ప‌వ‌న్ ఆగ్ర‌హానికి గురి కావ‌ల్సివ‌స్తుంద‌ని వెనుక‌డుగు వేసింది క‌త్తి చిత్ర‌బృందం. ప‌వ‌న్ సినిమా చేస్తాడేమో అని... క‌త్తి సినిమా తెలుగులో విడుద‌ల చేయకుండా ఆపేశారు. ఇప్పుడు హ‌ఠాత్తుగా ఈ సినిమాని తెలుగులో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లెట్టేశారు. న‌వంబ‌రు 7న తెలుగులో క‌త్తి విడుల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.