English | Telugu

నారీ నారీ నడుమ మురారి టీజర్.. శర్వానంద్ మరో సంక్రాంతి హిట్ కొడతాడా?

ఈ జనరేషన్ యంగ్ స్టార్స్ లో సంక్రాంతి హీరోగా శర్వానంద్(Sharwanand)కి పేరుంది. బిగ్ స్టార్స్ సినిమాలతో పోటీపడి మరీ.. 2016 సంక్రాంతికి 'ఎక్స్‌ప్రెస్ రాజా', 2017 సంక్రాంతికి 'శతమానం భవతి'తో హిట్స్ కొట్టాడు. ఇప్పుడు 2026 సంక్రాంతికి కూడా స్టార్స్ తో పోటీకి సై అంటూ 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో థియేటర్లలో అడుగుపెడుతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. (Nari Nari Naduma Murari)

'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్ చూస్తేనే.. ఇది ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే హీరో కథ అని అర్థమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ టీజర్ ఉంది. ప్రేయసి, మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వానంద్ కనిపిస్తున్నాడు. (Nari Nari Naduma Murari Teaser)

"పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను" అంటూ సత్యకి శర్వానంద్ చెబుతున్న డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. "నా పేరు లవకుశ.. లవ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా" అనే డైలాగ్ తో సత్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్న శర్వానంద్, సాక్షి వైద్య ప్రేమించి పెళ్లికి రెడీ అవుతారు. అయితే అదే ఆఫీస్ కి టీమ్ లీడ్ గా శర్వానంద్ ఎక్స్ గర్ల్ ఫెండ్ అయిన సంయుక్త మీనన్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో శర్వానంద్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే కోణంలో టీజర్ ని రూపొందించారు. టీజర్ చూస్తుంటే.. సినిమా సరదాగా, యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అర్థమవుతోంది.

Also Read: దివ్య దృష్టి మూవీ రివ్యూ

సరైన ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ పడితే.. శర్వానంద్ మ్యాజిక్ చేసేస్తాడు. పైగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు కావడంతో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో ఓ అంచనాకు రావొచ్చు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం 5:49 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. 'సామజవరగమన' స్థాయిలో కామెడీ వర్కౌట్ అయితే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.