English | Telugu

రైటర్ గా మారిన నాని.. స్టోరీ అదిరిపోతుంది!

డైరెక్టర్ అవుదామని సినీ పరిశ్రమకు వచ్చి, హీరో అయ్యాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). 'అష్టా చమ్మా'తో హీరోగా పరిచయడం కావడానికి ముందు.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. హీరోగా మారిన తర్వాత డైరెక్షన్ జోలికి మాత్రం పోలేదు నాని. అయితే కథల జడ్జిమెంట్ విషయంలో మాత్రం నానిలో ఓ మంచి దర్శకుడు కనిపిస్తుంటాడు. అందుకే ఆయన నటించిన సినిమాల్లో.. మెజారిటీ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతుంటాయి. అలాంటి నాని.. హీరోగా పరిచయమైన 15 ఏళ్ళ తరువాత తనలోని రచయితని పరిచయం చేయబోతున్నాడు.

ఆగష్టు 29న 'సరిపోదా శనివారం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్న నాని.. తన నెక్స్ట్ మూవీగా శైలేష్ కొలను డైరెక్షన్ లో 'హిట్-3' (Hit 3) చేయనున్నాడు. అయితే ఈ సినిమాకి నానినే కథని అందిస్తున్నాడట. నిజానికి నాని 'హిట్-3'ని కాస్త లేట్ గా చేయాలనుకున్నాడు. కానీ తనకి అదిరిపోయే స్టోరీలైన్ తట్టడంతో.. దానిని డైరెక్టర్ శైలేష్ కి చెప్పి డెవలప్ చేపించాడట. స్క్రిప్ట్ అద్భుతంగా రావడంతో.. 'హిట్-3'ని ముందు చేయాలని నాని నిర్ణయించుకున్నాడట.

నాని హోమ్ బ్యానర్ అయిన 'వాల్ పోస్టర్ సినిమా'లో 'హిట్-3' రూపొందనుంది. ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి, విలన్ గా రానా దగ్గుబాటి నటించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మరి నాని కథతో తెరకెక్కనున్న 'హిట్-3' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.