English | Telugu

ఏఎన్నార్ చివరి రోజులను తలచుకొని నాగార్జున ఎమోషనల్!

తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లను భావిస్తారు. ఈ ఇద్దరూ నటులుగా ఎంతో సాధించడమే కాకుండా.. తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ రాణిస్తే.. ఏఎన్నార్ మాత్రం చివరి శ్వాస వరకు నటుడిగానే కొనసాగారు. తాజాగా ఓ షోలో తన తండ్రి ఏఎన్నార్ చివరి రోజులను తలచుకొని నాగార్జున ఎమోషనల్ అయ్యారు.

జగపతి బాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోకి నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణంతో పాటు.. తండ్రి ఏఎన్నార్ తో అనుబంధాన్ని, తండ్రి చివరి రోజులను గుర్తు చేసుకున్నారు నాగార్జున.

"నాన్న పరిపూర్ణమైన మనిషి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయనకు కొడుకుగా పుట్టాను. ఎంత సాధించినా కూడా సింపుల్ గా ఉండేవారు. ఎంత గొప్ప వాళ్ళయినా కూడా.. తమకు నచ్చినట్టు బతకడం అంత తేలిక కాదు. కానీ, నాన్నగారు ఎలా బతకాలి అనుకున్నారో.. చివరి వరకు అలాగే బతికారు." అని ఏఎన్నార్ లైఫ్ స్టైల్ గురించి నాగార్జున గొప్పగా చెప్పుకొచ్చారు.

తను నటుడిగా ఎలా మారాడు అనే విషయం గురించి చెబుతూ.. "చిన్న వయసు నుంచి నాన్న గారిని చూస్తూ పెరిగాను కాబట్టి సినిమాలంటే ఆసక్తి ఉండేది. అయితే ఒకసారి సోదరుడు వెంకట్ వచ్చి.. నాగ్ నువ్వు నటుడిగా ట్రై చేయొచ్చు కదా అన్నాడు. దానికి నేను వెంటనే చేద్దాం అన్నాను. కానీ, నాన్న ఏమంటాడో అని చిన్న డౌట్ ఉండేది. నాన్న గారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పగానే.. ఆయన కళ్ళల్లో నీళ్లు చూశాను. అప్పుడు అర్థమైంది.. ఆయన నన్ను నటుడిగా చూడాలి అనుకుంటున్నారని." అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు నాగార్జున.

తన సినీ ప్రయాణం మాట్లాడుతూ.. "మొదటి సినిమా విక్రమ్ నాన్న గారి సూచనతో చేశాను. ఏఎన్నార్ కొడుకుగా నన్ను చూడటానికి ప్రేక్షకులు రావడంతో.. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను కానీ.. నాకు సంతృప్తి లేదు. ఆ సమయంలో 'గీతాంజలి', 'శివ' సినిమాలు నా మనసుకి నచ్చి చేశాను. ఆ రెండు ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత ప్రెసిడెంటు గారి పెళ్ళాం, హలో బ్రదర్ వంటి సినిమాలు నన్ను కొత్తగా ఆవిష్కరించాయి. ఇక అన్నమయ్య సినిమా అయితే.. ఆ దేవుడే నా దగ్గరకు పంపాడు అనుకుంటాను. అన్నమయ్య సినిమా చూసి నాన్నగారు నా చేతులు పట్టుకొని ఎమోషనల్ అయ్యారు. ఆ మూమెంట్ ని ఎప్పటికీ మరిచిపోలేను." అని నాగార్జున అన్నారు.

ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం 'మనం'. బెడ్ మీద ఉండే ఆ సినిమా డబ్బింగ్ ను పూర్తి చేశారు ఏఎన్నార్. ఈ విషయాలను కూడా నాగార్జున గుర్తు చేసుకున్నారు. "నాన్న గారు చివరి క్షణాల్లో కనీసం బెడ్ మీద నుంచి లేవలేకపోయారు. ఆయన్ని అలా చూసి తట్టుకోలేకపోయాం." అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.