English | Telugu

యన్ టి ఆర్ ఊసరవెల్లి రామానాయుడు స్టుడియోలో

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" రామానాయుడు స్టుడియోలో శరవేగంగా జరుగుతూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం"ఊసరవెల్లి". యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమాకి వక్కంతం వంశీ కథనందించారు. ఈ యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమా ఇప్పటివరకూ అరవై శాతం పూర్తయిందని వినికిడి.

ప్రస్తుతం యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమా నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో జూన్ 13 నుండి జరుగుతూంది. యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమాకి యువసంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. యన్ టి ఆర్ "ఊసరవెల్లి" సినిమాతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మిస్తున్న "చుర కత్తి" సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా ఆయన సరసన నటిస్తూంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.