English | Telugu

ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్!

ప్రస్తుతం 'దేవర', 'వార్-2' సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయిందని, షూటింగ్ కి ముహూర్తం కూడా ఖరారైందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. 'దేవర' రిలీజ్, 'వార్-2' షూట్ ఉండటంతో.. ఎన్టీఆర్ లేకుండానే మొదటి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట.

సెప్టెంబర్ 27న 'దేవర' విడుదల కానుంది. దాదాపు నెలరోజుల పాటు ఆ మూవీ ప్రమోషన్స్ ఎన్టీఆర్ బిజీగా ఉండే అవకాశముంది. అందుకే ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలతో నీల్ ప్రాజెక్ట్ షూట్ కాబోతుంది. మరోవైపు 'వార్-2' షూట్ కూడా పారలల్ గా జరగనుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.