English | Telugu

'నాన్నకు ప్రేమతో' మేనియా మొదలైంది

రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా కూడా 'నాన్నకు ప్రేమతో' మేనియాతో ఊగిపోతున్నారు జనం. ఎన్టీఆర్‌ కు ఇది 25వ సినిమా కావడంతో 'ఎన్టీఆర్‌ 25' అని ముద్రించిన టీషర్టులతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు జనం. ఎన్టీఆర్ వేసిన కొత్త గెటప్ తో మాస్కులు తయారు చేసుకుంటున్నారు. ఇంకా అమ్మాయిలైతే హెన్నాతో ఎన్టీఆర్ పేరును చేతులపై ముద్రలు వేయించుకుంటున్నారు.కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి ప్రాంతాల్లో సైతం ఎన్టీఆర్‌ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఓవర్సీస్ లో ‘నాన్నకు ప్రేమతో’ బెనిఫిట్ షోలకు కూడా అభిమానులు ఉత్సాహంగా తయారవుతున్నారు. ఎంత రేటైనా పెట్టి టికెట్లను కొనుక్కోవడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌ కు మంచి సినిమా పడాలి, హైప్‌ రావాలే కానీ.. ఫ్యాన్స్‌ నుంచి ఎలా అభిమానం తన్నుకొస్తుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఇక ఈ సినిమా హిట్టైతే అభిమానులకు పండగే పండగ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.