English | Telugu

మోహన్ బాబు 'పద్మశ్రీ' వివాదం ముగిసింది

ప్రముఖ సినీ నటుడు బాబుకు పద్మశ్రీ తిరిగొచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఆయన ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కరాన్ని కొనసాగించాలని తీర్పిచ్చింది. దీంతో మోహన్ బాబు మళ్లీ పద్మశ్రీ మోహన్ బాబు అవుతున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని మోహన్‌బాబు దుర్వినియోగం చేస్తున్నారంటూ గతంలో మోహన్‌బాబుపై కేసులు నమోదు కావడం, హైకోర్టు ఈ విషయమై సీరియస్‌గా స్పందించి, పద్మశ్రీని మోహన్‌బాబు ఉపయోగించుకోరాదని తేల్చి చెప్పిన విషయం విదితమే.ఈ నేపథ్యంలోనే మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇకపై ఎక్కడా పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయబోమనని ప్రమాణం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు మోహన్‌బాబు. మోహన్‌బాబు అఫిడవిట్‌పై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ఇకనుంచి పద్మశ్రీ పురస్కారం మోహన్‌బాబుకి యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.