English | Telugu

జైలర్ 2 పనుల్లోనే ఉన్నాడు..ఆ విషయం ఆయన చేతుల్లోనే ఉంది

సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కెరీర్ కి జైలర్ మూవీని ఒక రకంగా కమ్ బ్యాక్ మూవీగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే వరుస ప్లాప్ ల తర్వాత రజనీ సత్తా చూపించిన సినిమాగా జైలర్ నిలిచింది. ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని కొన్నాళ్ళ క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పడు ఒక హీరోయిన్ అది నిజం అని చెప్తుంది. దీంతో రజనీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.

గత సంవత్సరం అగస్ట్ 9 న వచ్చిన జైలర్ రజనీ కెరిరీలోనే అత్యథిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.రజనీ పవర్ ఫుల్ యాక్టింగ్ కి సిల్వర్ స్క్రీన్ మొత్తం దాసోహమయ్యింది. పాన్ ఇండియా లెవల్లో రికార్డులు కొల్లగొట్టిన ఆ మూవీలో రజనీ కోడలుగా చేసి మెప్పించిన నటి మిర్న మీనన్. ఈమె చాలా సినిమాల్లో హీరోయిన్ గాను చేసింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు జైలర్ దర్శకుడు నెల్సన్ తో ఇటీవలే మాట్లాడానని ఆయన ప్రస్తుతం జైలర్ 2 స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నారని చెప్పింది. అయితే పార్ట్ 2 లో తాను ఉన్నానో లేదో తెలియదని అది దర్శకుడు చేతిలోనే ఉందని చెప్పింది. ఈమె చెప్పిన మాటలతో జైలర్ 2 పక్కాగా ఉంటుందనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది.

ఇప్పుడు పార్ట్ 2 లో ఎవరెవరు రజనీ తో కలిసి స్క్రీన్ పంచుకుంటారనే విషయంలో కూడా చాలా మందిలో క్యూరియాసిటీ ఏర్పడింది. రౌడీలని దారికి తెచ్చే పోలీస్ ఆఫీసర్ గా, సంఘవిద్రోహ శక్తులతో చేతులు కలిపిన సొంత కొడుకుని సైతం చంపేసే వ్యక్తిగా పార్ట్ 1 లో రజనీ నటన ఎక్స్ట్రార్డినరీ గా ఉంటుంది. మరి పార్ట్ 2 లో ఎలాంటి కథతో వస్తారో చూడాలి.


ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.